ఏపీలో ఘోర ప్రమాదం..ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి

-

A terrible accident : ఏపీ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ఏపీలోని పల్నాడులో ఘోర ప్రమాదం జరిగింది. వినుకొండ పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ, కారు ను ఢీ కొట్టింది.

A terrible accident in AP Three youths died

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించా.రు అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version