టీవీ సీరియల్ నటి అక్రమ సంబంధం…మీడియాను ఆశ్రయించిన భర్త…!

-

అత్తారింటికి దారేది, పలుకే బంగారామాయే సీరియల్ ఫేమ్ అడ్డాల ఐశ్వర్ పెళ్లి పేరుతో చీటింగ్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు శ్యామ్ కుమార్. ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియా ను ఆశ్రయించాడు భర్త శ్యామ్ కుమార్. పెళ్లయిన తర్వాత పాతిక లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Actress Addala Aishwarya Husband Accuses His Wife

వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని… తిరిగి తనపైనే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత భర్త పిన్నింటి శ్యామ్ కుమార్. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటి ఐశ్వర్య ని పెళ్లి చేసుకున్నారు పిన్నింటి శ్యాం కుమార్.

 

జి తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్ లో నటిస్తున్నారు అడ్డాల ఐశ్వర్య. అయితే…పెళ్లి అయినా నెల రోజుల తర్వాత ఆమె అక్రమ సంబంధం బయటపడింది. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబు తో వివాహేత సంబంధం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతుందంటూ ఆరోపణలు చేస్తున్నారు శ్యామ్‌ కుమార్. ఈ తరుణంలో మీడియాకు ఆధారాలతో కలిసి చెప్పారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version