తిరుమల భక్తులకు అలర్ఠ్..దర్శనాలకు ఎంత సమయం అంటే ?

-

తిరుమల భక్తులకు అలర్ఠ్..దర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 06 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.

Alert for devotees of Tirumala Darshan takes 12 hours

ఇక నిన్న తిరుమల శ్రీవారిని 65683 మంది భక్తులు దర్శించుకున్నారు. 23453 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాదు.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా నమోదు అయింది.

ఇక అటు తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి… తిరుమల శ్రీవారి భక్తులకు వడలు కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్, టీవీ 5 ఛానెల్‌ బి.ఆర్ నాయుడు ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటుందట టిటిడి పాలక మండలి. కాగా పైలెట్ ప్రాజెక్టుగా జనవరిలో వారం రోజులపాటు రోజుకు 5000 చొప్పున వడలు వడ్డించిన సంగతి తెలిసిందే. అయితే లక్ష మంది భక్తులకు వడ్డించేందుకు.. సిబ్బంది కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news