డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైళ్లోనే ఉండాలి – అమర్నాథ్‌

-

చంద్రబాబు పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు పేల్చారు. చంద్రబాబు వెల్ నెస్ సెంటర్లో కాదు జైల్లో వున్నాడని…నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే జైళ్లను పెట్టిందన్నారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టిన జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి…ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం సింపథీ కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైళ్లోనే ఉండాలని చురకలు అంటించారు ఏపీ మంత్రి అమర్నాథ్‌.

సీఐడీ విచారణ తర్వాత లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నాడు..దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారితో నిజం చెప్పరన్నారు. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయి కానీ లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదు….హెరిటేజ్ కోసం అమరావతిలో 14ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలని చురకలు అంటించారు. మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు…..లోకేష్ తప్పుకి శిక్షపడ్డం ఖాయం, కోర్టు కూడా నమ్మిందని వివరించారు మంత్రి అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news