జగన్ ఏం పీకుతాడు అన్నాడు…రెండు పీకి జైలుకు పంపాడు – అంబటి

-

జగన్ ఏం పీకుతాడు అన్నాడు…రెండు పీకి జైలుకు పంపాడంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు మంత్రి అంబటి రాంబాబు. టిడిపి పాలన లో చేసిన దోపిడీ బయట పడింది….వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని.. పైగా కక్ష్య సాధింపు అని మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కక్ష్య సాధింపు చేయాలంటే మొడటి సంవత్సరమే లెక్క చూసే వాళ్ళమని.. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సిఐడి అధికారులు అరెస్ట్ చేశారని ఆగ్రహించారు మంత్రి అంబటి రాంబాబు.

17a ని అడ్డు పెట్టుకొని బయట పడాలని చూస్తున్నారు…కానీ తప్పు చేయలేదని ఎక్కడ చెప్పడం లేదు…పచ్చగా ఉన్న టిడిపి లోకేష్ కాలు తో మాడి పోయింది….లోకేష్,బాబుల వాగుడు తో నే ఇక్కడ దాకా తెచ్చుకున్నారని చురకలు అంటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు జగన్ నన్ను ఏం పీకుతాడు అన్న చంద్రబాబు మాటలకు సమాధానం వచ్చింది…రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారని ఎద్దేవా చేశారు. తండ్రి అరెస్ట్ ఐతే రాజమండ్రి లో లేకుండా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్… ఇప్పుడు నీతులు చెప్తున్నారు…టిడిపి పని ఐపోయిందన్న పవన్ వ్యాఖ్యలు ప్రజలు అర్దం చేసుకోవాలని కోరారు మంత్రి అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news