యూ టర్న్ లు మొదలుపెట్టిన చంద్రబాబు..!

-

ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవ్వకముందే చంద్రబాబు యూ టర్న్ లు మొదలుపెట్టారు అని YCP నేత అంబటి రాంబాబు తెలిపారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు అని అన్నారు. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు అని పేర్కొన్నారు. కేంద్రం 15 వేల కోట్లు గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు. అయితే అదంతా అప్పే… ఆ అప్పును కేంద్రం ఇప్పిస్తుంది అనేది వాస్తవం అని పేర్కొన్నారు.

ఫించన్ కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట చంద్ర బాబు ఏరివేస్తారు అని అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తోంది అంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకు రోత పుడుతోంది అని మాజీ మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version