AP: ఒక్కొక్కరికి రూ.15వేలు.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి!

-

Ammaku Vandanam Scheme: ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకొని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

CM Chandrababu 

ఆధార్ వచ్చేవరకు పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకులకు రూ. 15 వేలు, స్టూడెంట్ కిట్ లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.

కాగా, సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం పదింటికి వైజాగ్ చేరుకొని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. వైజాగ్ లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news