అమ్మ ఒడి లబ్దిదారులకు అలర్ట్‌.. అకౌంట్లోకి రూ.13వేలు..!

-

అమ్మ ఒడి లబ్దిదారులకు అలర్ట్‌. అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.13,000 జమ చేయగా… కొందరి అకౌంట్లలో ఇంకా డబ్బులు పడలేదు. EKYC పెండింగ్ లో ఉన్న వారి వివరాలను తాజాగా విడుదల చేసిన ప్రభుత్వం… రెండు రోజుల్లో వారంతా సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో EKYC పూర్తి చేయాలని ఆదేశించింది. ఏకీక పూర్తయిన వారికి వచ్చే వారం అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా, గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జేఎల్ఎం గ్రేడ్-2 ఉద్యోగాలు పొందిన వారిలో అర్హత గల వారిని పర్మినెంట్ చేస్తూ ఏపీ తూర్పు, మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. మూడు విద్యుత్ సంస్థల్లో కలిపి మొత్తం 7,883 మందిని 2019లో నియమించగా… ఇప్పుడు వారిని పర్మినెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version