చంద్రబాబును కలిసిన ఆమ్రపాలి, మరో ముగ్గురు ఐఏఎస్‌లు!

-

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ నుంచి బదిలీపై వచ్చిన నలుగురు ఐఏఎస్‌ అధికారులు కలిశారు.ఉండవల్లిలోని సీఎం ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్,ఆమ్రపాలి,వాకాటి కరుణ,వాణి ప్రసాద్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.శుక్రవారం టీడీఎల్పీ సమావేశం జరుగుతున్న సందర్భంగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు డీవోపీటీ ఆదేశాలకు స్వరాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.

అంతకుముందు డివోపీటీ ఆదేశాలను ఈ నలుగురు ఐఏఎస్‌లు క్యాట్‌లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వారికి చుక్కెదురు కావడంతో ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. దీంతో చేసేది ఏమీ లేక గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ను ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ కలిసి జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version