టీడీపీ ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక..!

-

టీడీపీ ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక జారీ చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు.కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి సంపాదించుకోవాలని చూడకూడదు. మాగుంట ఫ్యామిలీకి ఎప్పటినుంచో లిక్కర్ వ్యాపారం లో ఉంది. అందుకే మాగుంట ఫ్యామిలీకి లిక్కర్ విషయంలో మినహాయింపు ఉంది. నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా..  విశ్వసనీయత పోవడం ఒక్క నిమిషం చాలు అన్నారు.

దేశం క్లిష్ట పరిస్తితుల్లో ఉన్నప్పుడు టీడీపీ కీలక పాత్ర పోషించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అధికారం కోసం కాకుండా దేశం, ప్రజల కోసం పాటు పడిందని పేర్కొన్నారు. పదవులు తీసుకోకుండానే వాజ్ పేయి ప్రభుత్వంలో కొనసాగామని గుర్తు చేశారు. తాజాగా ఎన్డీఏతో పొత్తు సందర్భంగా కూడా ఎలాంటి డిమాండ్లు చేయలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ శక్తిమంతమైన పార్టీగా ఆవిర్భవించిందన్నారు. ఏ పని కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందో దానికే ఉపయోగించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version