YCP MPTC వేధింపులతో..అంగన్వాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నం

-

 

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీటీసీ వేధింపులతో….. దళిత అంగన్వాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెదపారుపూడి మండలం గురివిందగుంటలో అంగన్వాడి కార్యకర్తగా 20 ఏళ్లుగా అన్నపూర్ణ పనిచేస్తున్నారు. ఎంపీటీసీ సత్యనారాయణ, వైసీపీ నేత జోజిబాబులే తన చాపుకారణమంటూ సూసైడ్ నోట్ రాశారు అన్నపూర్ణ.

మాట వినకపోవడంతో అంగన్వాడీ కార్యకర్త అన్నపూర్ణను, వైసిపి నేతలు వేధింపులకు గురి చేశారు. మీడియా ఛానళ్ల ప్రతినిధులతో బెదిరింపులకు గురిచేశారు. అన్నపూర్ణకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైసిపి నేతల ఒత్తిడికి తలోగ్గి అన్నపూర్ణ చేత బలవంతంగా లెటర్ రాయించుకున్నారు ఐసిడిఎస్ అధికారులు. అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఎలుకలమందు తాగింది అన్నపూర్ణ. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు కుటుంబ సభ్యులు. అధికార పార్టీ నేతల నుండి తమకు రక్షణ కల్పించాలంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version