Ap Elections: ఇవాళ వైసీపీ పార్టీ అభ్యర్థుల ప్రకటన

-

సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి. నేడు ఇడుపులపాయాలు వైసీపీ ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల లిస్టును జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత…. అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తారు.

cm jagan

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైసిపి నేతలు. మొత్తం అభ్యర్థులను ఇవ్వాల్నే ప్రకటించే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా ఇవాళ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version