తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఈ నెల 25న ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఈ నెల 25న ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 25వ తేదీన ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి. అలాగే, ఆగస్ట్‌,సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు అదనపు కోటా కింద 4 వేల టికెట్లు విడుదల చేయనున్నారు.

అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15 వేల టికెట్లు చోప్పున విడుదల చేయనుంది టిటిడి. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 63,628 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీకి రూ. 4.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news