ఏపీలోని 18 ఏళ్లు నిండినవారికి అలర్ట్..ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన !

-

ఏపీలోని 18 ఏళ్లు నిండినవారికి అలర్ట్..ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన వెలువడింది. APలో నేటి నుంచి ఓటర్ల జాబితాల పరిశీలనకు BLOలు ప్రతి ఇంటికి రానున్నారు. మీ పేరు జాబితాలో లేకపోతే వారు ఎంటర్ చేస్తారు. వచ్చే జనవరికి 18 ఏళ్ళు నిండే వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఆగస్టు 21 వరకు కార్యక్రమం కొనసాగనుంది. అక్టోబర్ 17న ముసాయిదా జాబితాను విడుదల చేసి, నవంబర్ 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నేతన్నలకు శుభవార్త.. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధిదారులకు ఇవాళ సీఎం జగన్ నిధులు అందించనున్నారు. 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున మేర జమ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news