ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరు: బొత్స

-

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. నేతులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా చేసిన ప్రయోజనం పేద ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది చంద్రబాబు ఉద్దేశమని.. తాను వస్తే పథకాలు ఏమీ ఇవ్వనని చంద్రబాబు పరోక్షంగా చెబుతున్నాడని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇది దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరుందని విమర్శించారు. చంద్రబాబు లా క్రీములు, పౌడర్ల కోసం వాడలేదని అన్నారు. ప్రత్యేక హోదాకు వైసీపీ కట్టుబడి ఉందని అన్నారు. చంద్రబాబులా అర్ధరాత్రి మాట మార్చలేదని అన్నారు. కాంట్రాక్టుల కోసం చంద్రబాబు తాకట్టుపెట్టాడని విమర్శించారు. లక్షల కోట్లు తెచ్చి తమ సామాజిక వర్గానికి ప్రయోజనం కలగాలి అంటే ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు చేసి కాంట్రాక్టులకు దోచి పెట్టాడని ఆరోపించారు. బాలకృష్ణ సినిమా వాడు కదా సినిమా డైలాగులు చెబుతున్నాడని.. బాలకృష్ణ నాన్నను, రాష్ట్రాన్నే ఆయన బావమరిది మింగేశాడని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version