ఏపీ గవర్నర్ తో కాంగ్రెస్ నేతల భేటీ.. పలు ఘటనలపై ఫిర్యాదు

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక ఘటనలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నానాటికీ శాంతిభద్రతలు సన్నగిల్లుతున్నాయి అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్సీ నే స్వయంగా సుబ్రహ్మణ్యం ని చంపేసిన వైనాన్ని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కి వివరించారు. అదే సమయంలో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం లో చోటు చేసుకున్న అల్లర్ల పైన వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలపై నా పోలీసులు పెద్దగా స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version