ముంబై నటి వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు..!

-

వైసీపీలో ఇమడలేక చాలా మంది మావైపు వస్తామంటున్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయి. ముంబై నటి వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపింది. ఇక పై తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేది.

మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గుడ్లవల్లేరు కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదు. అయినా దర్యాప్తు ఆపం, సమగ్ర విచారణ కొనసాగుతుంది. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలి. తప్పు చేసిన ఎవరినీ మా ప్రభుత్వం ఉపేక్షించదు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version