నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

-

ఏపీలో కూటమి సాయంతో ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దూకుడుగా సాగుతున్నారు. పాలనాపరమైన నిర్ణయాలతో తన మార్క్ చూపిస్తున్నారు. మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేవలం ఏపీలోనే కాకుండా.. తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

ఇందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు పార్టీ బలోపేతంపై చంద్రబాబు.. స్థానిక నేతలతో చర్చించారు. ఇప్పుడు మరోసారి ఆయన నగరానికి రానున్నారు. ఇవాళ (శనివారం) నాడు ఆయన సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు. టీడీపీ కార్యకర్తలతో సమావేశమై.. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, బలోపేతంపై చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే విషయాలపై నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news