ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి రోజూ 100 లోపే కరోనా మహమ్మారి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 57 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

carona ap

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2318858 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో ఒక్కరు కూడా చనిపోలేదు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 730 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 606 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 84 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2303522 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 11,980 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 33262073 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version