అలర్ట్.. నేడు ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌

-

ఏపీలో టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ప్రభుత్వం ఈరోజు (జులై 1వ తేదీ 2024) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం (జులై 2వ తేదీన) అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నట్లు సురేశ్ కుమార్ వెల్లడించారు. 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఆగస్టులో టెట్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డీఎస్సీకి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టెట్‌కు డీఎస్సీ పరీక్షకు మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version