తెనాలిలో దారుణం.. యువతి బ్రెయిన్ డెడ్..!

-

ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐతా నగర్ కి చెందిన యువతి పై నవీన్ అనే వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. నిన్న సాయంత్రం కారులో యువతిని నవీన్ తీసుకువెళ్లాడు. కొద్ది సేపటి తరువాత అపస్మారక స్థితిలో యువతిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెళ్లి పోయాడు నవీన్. యువతిని పరిశీలించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని.. వైద్యులు నిర్ధారించారు.

తలపై బలంగా కొట్టడంతోనే అలా జరిగి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యువతిని కోమాలోకి వెళ్లేలా కొట్టిన యువకుడు నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. అధికారమదంతో గత నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు టీడీపీ గూండాలు.. ఇప్పుడు యువతులపై కూడా దాడి చేస్తున్నారని పేర్కొంటున్నారు. చేతగాని పాలనలో అత్యాచారాలు, అఘాయిత్యాల్లో ఇప్పటికీ బీహార్ ని మించిపోయింది ఏపీ అంటూ వైసీపీ నాయకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version