విశాఖ గర్జన కాదు.. పిల్లి కూతలో కుక్క అరుపు – బండారు సత్యనారాయణ

-

 

వైసీపీ నేతలు చేస్తోంది గర్జన కాదు.. పిల్లి కూతలో.. కుక్క అరుపులో చేస్తున్నారని..కప్పల అప్పల్రాజు ఏంటో కప్పలా అరుస్తున్నాడని ఆగ్రహించారు బండారు సత్యనారాయణ మూర్తి. ఉత్తరాంధ్రను మేమే అభివృద్ధి చేశామన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభివృద్ధి చేసిందని నిరూపించ లేకుంటే చెప్పుతో కొట్టుకుంటామని హెచ్చరించారు బండారు సత్యనారాయణ మూర్తి.

విశాఖ భూములపై వేసిన సిట్-1, సిట్-2 నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదు..? అని నిలదీశారు. సిట్ నివేదికలో ఉన్న అంశాలని పట్టుకుని జగన్, విజయసాయి బేరాలు పెట్టుకుంటున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. రెండు సిట్ల నివేదికలు బయటకొస్తే జగన్, విజయసాయి రెడ్డిలకు జైల్లో బ్యారెక్స్ సిద్దంగా ఉంటాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మంచిదని మంత్రి ధర్మాన అంటారా..? అని ఆగ్రహించారు బండారు సత్యనారాయణ మూర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version