తెనాలిలో ఉద్రిక్తత.. ప్రభుత్వ స్థలంలో మేరీ మాత విగ్రహం..!

-

గుంటూరు జిల్లా.. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి ఏర్పాటు చేసారు మేరీ మాత విగ్రహం. చంద్రబాబు నాయుడు కాలనీ లో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కుకు ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు. కానీ మున్సిపల్ అధికారులు కాల్వలు శుభ్రం చేసే క్రమంలో నిన్న మురుగు కాల్వ పక్కన శుభ్రం చేసి వెళ్ళగా స్థానికులు మేరీ మాత విగ్రహం ఏర్పాటు చేసారు.

అయితే అనుమతులు లేవని బొమ్మ తొలగించాలని స్థానికులకు ఆదేశించారు మున్సిపల్ అధికారులు. బొమ్మ తొలగించటం కుదరదని మున్సిపల్ అధికారులకు అడ్డం తిరిగారు స్థానికులు. పోలీసుల సహాయంతో బొమ్మను తొలగించారు మున్సిపల్ అధికారులు. అయితే బొమ్మ తొలగించే క్రమంలో పోలీసులకు స్థానికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బొమ్మ తొలగించే క్రెయిన్ పై రాళ్ళతో కొట్టారు స్థానికులు. ఘర్షణకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేరీ మాత విగ్రహం తొలగిస్తే పక్కనే ఉన్న నిత్యం పూజలు అందుకునే అంకమ్మ తల్లి చెట్టు కూడా తొలగించాలని డిమాండ్ చేసారు స్థానికులు. దాంతో చెట్టు కింద ఉన్న దిమ్మను కూడా తొలగించారు మున్సిపల్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version