ఇవాళ ఏపీలో అడుగు పెట్టనున్న బండి సంజయ్

-

ఇవాళ ఏపీలో అడుగు పెట్టనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. మరి కాసేపట్లో విజయవాడకు బయలుదేరనున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్….రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి గన్నవరం వెళ్లనున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్నారు బండి సంజయ్. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని సమీక్షించనున్నారు బండి సంజయ్. సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version