జగన్ ది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం – భూమన

-

తిరుపతి : సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం అని భూమన చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున గడప గడపకు వెళ్లి తెలుసుకుంటున్నామని తెలిపారు.

అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యంగా తిరుపతి లో ప్రారంభించామని వెల్లడించారు. ప్రతి గడప గడప ప్రతి ఇంటి నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కు గత ఎన్నికల్లో తిరుపతిలో 89 వేల మంది ఓట్లు వేస్తే, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షలు 20 వేల మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. 1600 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి ఇంటికి అందించామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version