ఇవాళ టిటిడి చైర్మన్ గా భూమన భాధ్యతల స్వీకరణ

-

కాగా, ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.శ్రీనివాసుని దర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 75,594 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,213 మంది తలనీలాల సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 4.69 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. ఇక ఎల్లుండి స్వచ్చ తిరుమల~శుద్ద తిరుమల కార్యక్రమాని నిర్వహించనుంది టిటిడి. ఈ సందర్భంగా రెండు ఘాట్ రోడ్డులు, నడకమార్గాలలో ప్లాస్టిక్ వ్యర్దాలనను ఎన్ సిసి విద్యార్దులు తొలగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version