తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటలు పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం బయటివరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే స్వామివారిని మొత్తం 63,208 మంది భక్తులు దర్శించుకున్నారు.

32,951 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.