ఏపీలో రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌..!

-

ఏపీలో రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం ఏలూరు మీదుగా వెళ్లే కొన్ని రైళ్ళను రద్దు చేయగా, మరికొన్నిటిని దారి మళ్ళించారు. విజయవాడ సమీపంలోని విజయవాడకు, రామవరప్పాడుకు మధ్యలో రైళ్ల రాకపోకలు పూర్తిగా రద్దు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

Train accident in AP
Big alert for train passengers in AP

ఈనెల 13, 14, 15, 17, 18 తేదీలలో…. విజయవాడ – విశాఖపట్నం(22702), విశాఖ – విజయవాడ(22701) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు – విశాఖపట్నం(17239) ఈనెల 13 నుంచి 19 వరకు…. విశాఖపట్నం – గుంటూరు(17240) 14 నుంచి 20 వరకు రద్దు చేశారు. నరసాపురం – విజయవాడ(07863), విజయవాడ – నర్సాపూర్(07861) రైళ్లను ఈనెల 13 నుంచి 19 వరకు విజయవాడ – రామవరప్పాడు మధ్యలో రద్దు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news