బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ మృతి..!

-

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్యం బారిన పడడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆకస్మికంగా మృతి చెందారు. లోకుల గాంధీ విశాఖపట్నం జిల్లా పాడేరు వాసి….ఆయన విద్యార్థి నాయకుడిగా సంఘ్ నేతగా బిజెపిలో నాయకుడుగా ఎదిగారు. చిన్ననాటి నుండి పార్టీపై అభిమానం తో ఎన్నో కార్యక్రమాలు చేశారు.

2014 మరియు 2019 ఎన్నికల్లో లోకుల గాంధీ బిజెపి తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేకాకుండా రీసెంట్ గా కిషన్ రెడ్డి యాత్రలో కూడా లోకుల గాంధీ కీలకంగా పని చేశారు. లోకుల గాంధీ మరణం పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. అలాగే జివిఎల్, గవర్నర్ దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. ఏపీ బిజెపికి గాంధీ మరణం తీరనిలోటని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news