ఇద్దరూ పిల్లలతో కలిసి కాల్వలో దూకి.. మహిళా ఆత్మహత్యాయత్నం..!

-

సాధారణంగా ఈ మధ్య కాలంలో రోజు రోజుకు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటికి రకరకాల కారణాలు ఉంటున్నాయి. కొంత మంది భర్త వేధింపులు అయితే.. మరికొందరూ అప్పుల బాధతో ఇలా రకరకాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళకు ఏం ఆపద వచ్చిందో.. ఏం కష్టమొచ్చిందో తెలియదు. కానీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .  ఏపీలోని విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది ఓ మహిళ. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే ఆ చిన్నారిని హాస్పటల్ కి తరలించే లోపే చనిపోయింది. మరోవైపు తల్లి కుమారుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడి చేరుకుని పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version