చంద్రబాబు ఏమైనా దేవ దూతనా ?

-

ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు త్వరలో జమిలీ ఎన్నికలు వస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద మంత్రి బొత్స స్పందించారు. జమిలి ఎన్నికలు ఎందుకు వస్తాయని ప్రశ్నించిన ఆయన బాబు జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అనుకున్నట్లు ఎన్నికలు జరగవన్న ఆయన రాజ్యాంగం ప్రకారం ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పడానికి చంద్రబాబు ఏమైనా దేవ దూతనా అని ఆయన ప్రశ్నించారు.

ఒక వేళ ఎన్నికలు జరిగితే మరో ఐదేళ్లు చంద్రబాబు ప్రతిపక్షమేనని బొత్స అన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్న ఆయన దీనికి కారణం పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలే అని అన్నారు. ఈజీ ఆఫ్ డ్యూయింగ్ మొదటి స్థానం రావడానికి విద్యుత్ సంస్కరణలు కూడా కారణమని అన్నారు. స్వాతంత్ర్య వచ్చినప్పుడు నుంచి ఎంత అప్ప ఉందొ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానికి మూడు రెట్లు అప్పు చేశారని అన్నారు. చంద్రబాబు ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేశారని పేదలకు మేలు చేయకూడదు అన్నది చంద్రబాబు సిద్ధాంతం అని బొత్స పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news