ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైసీపీలో లేరు – బొత్స కీలక ప్రకటన

-

ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో లేరని ప్రకటన చేశారు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్ససత్యన్నారాయణ. తిరుమలలో వీఐపీ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ జకియా ఖానంతో వైయస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ వెల్లడించారు.

botsa , jakia khanam

ఈ విషయాన్ని అనవసరంగా వైయస్సార్‌సీపీకి అంటగట్టేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైయస్సార్‌సీపీలో లేరని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిందన్నారు, అంతేకాక పలు సందర్భాలలో మంత్రి లోకేష్‌తో భేటీ అయిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version