జగన్‌ చేతిలో అవినాష్ బలి పశువు కాబోతున్నాడు – బుద్దా వెంకన్న

-

నిన్న సీఎం జగన్… అవినాష్ కలవడం వెనుక కుట్ర కోణం ఉందని.. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారని టీడీపీ సీవియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్‌ చేతిలో అవినాష్ బలి పశువు కాబోతున్నాడని ఆరోపించారు. గతంలో పార్టీ కార్యాలయం మీద దాడి చేయించి అవినాషును బలి పశువును చేశారని చురకలు అంటించారు.

బెజవాడలోని వైసీపీ మూడు సీట్లను ప్రకటించడానికి సజ్జల ఎవరు..? అని ప్రశ్నించారు. మూడు సీట్లల్లోనూ వైసీపీ మట్టి కరవడం ఖాయమన్నారు. యార్లగడ్డను పార్టీలో చేర్చుకునే అంశం పార్టీ అధినాయకత్వమే చూసుకుంటుందని వెల్లడించారు. యార్లగడ్డ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమేనని.. వైసీపీ యార్లగడ్డను వాడుకుని వదిలేసిందన్నారు టీడీపీ సీవియర్ నేత బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news