ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

-

ఇవాళ, రేపు ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. ఈ సందర్భంగా రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

Central Election Commission visit in AP today and tomorrow

నిన్న రాత్రే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని టీం విజయవాడ చేరుకుంది. ఈ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news