చంద్రబాబు, పవన్ లకు ఏపీ పోలీసులు షాక్‌..సభలపై నిషేధం

-

చంద్రబాబు, పవన్ లకు ఏపీ పోలీసులు షాక్‌ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ ల అనకాపల్లి టూర్ లపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనకాపల్లి జిల్లాలో సెక్షన్ 30 అమలలో ఉందని ఎస్పీ మురళికృష్ణ ప్రకటన చేశారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, పబ్లిక్ రోడ్ షోలు నిషేధం విధించారు పోలీసులు.

8న బాబు, 10 నుంచి పవన్ పర్యటనలు ఉన్న నేపథ్యలోనే..ఆ ఆంక్షలు అమలు చేస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. కాగా, చంద్రబాబు పుంగనూరు పర్యటనలో పోలీసులు, వైసిపి కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారని ఆరోపిస్తున్న అధికారపక్షం పిలుపు మేరకు ఇవాళ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. బస్సులు రోడ్డు ఎక్కలేదు. నిన్న ఘర్షణలో గాయపడిన పోలీసులు, కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version