తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుంది – చంద్రబాబు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలంలోని వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుందని పేర్కొన్నారు చంద్రబాబు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఉండే పార్టీ తెలుగుదేశం అని.. తెలుగుదేశం ఆవిర్భావమే తెలంగాణ లోని హైదరాబాద్ లో జరిగిందని వెల్లడించారు.

యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ లోనూ తెలుగుదేశం ఉండాలని.. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అని.. ఇక్కడి వారిని చూస్తుంటే తెలంగాణ తో పాత అనుభవాలు గుర్తుకొస్తున్నాయని గుర్తు చేశారు.

దూరదృష్టితో 2000 సంవత్సరం లో భద్రాచలంలో చేపట్టిన కరకట్టల అభివృద్ధి ఇప్పుడు అందరినీ కాపాడిందని తెలిపారు. వరదల్లో చనిపోయిన నరసయ్య మరణం తీవ్రంగా కలచి వేసిందని.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ పార్టీ పరంగా రూ.లక్ష సాయం అందిస్తామన్నారు. ఇలాంటి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version