భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు : వై.వీ.సుబ్బారెడ్డి 

-

భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మన్  వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేము తిరుమల పవిత్రతను కాపాడామని తెలిపారు. స్వామి వారి నైవేద్యంలో కల్తీ జరుగుతుందని.. లడ్డులో ఆవు నెయ్యి వాడటం లేదని చంద్రబాబు ఆరోపణలు చేశారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు చంద్రబాబు అని పేర్కొన్నారు. 

నేను వేంకటేవ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.  మీ ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. మీరు కూడా ప్రమాణం చేయండి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. లేదంటే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెల్తామని హెచ్చరించారు.  ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి నీచమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అని వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజల దృష్టిలో వైసీపీని దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు ఏ రూల్స్ ఉన్నాయో వాటిని కొద్ది మార్పులతో కొనసాగించామని తెలిపారు వై.వీ.సుబ్బారెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version