పేద కుటుంబానికి స్వయంగా చంద్రబాబు పెన్షన్ అందజేత

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పరిపాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. అలాగే పేద ప్రజలకు పెన్షన్లు పంపిణీ చేయడంలో కూడా ముందుంటున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఓ పేద కుటుంబం ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వారింట్లో ఇద్దరికి స్వయంగా పెన్షన్ డబ్బులను అందజేశారు.

అనంతరం వాళ్ల ఫ్యామిలీని అప్యాయంగా పలకించారు. ఎవరు ఏం చేస్తున్నారో కనుక్కున్నారు. పిల్లలు ఏం చదువుకున్నారని అడిగారు. కాళ్లకు మొక్కపోతే వద్దని చెప్పారు. ‘నువ్వు నా కాళ్లు పట్టుకుంటే నేను పట్టుకోవాల్సి వస్తుంది.’ అని తెలిపారు. వారితో కలిసి చంద్రబాబు గ్రూపు ఫొటోలు దిగారు. తాము ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, తమకు ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబును ఆ కుటుంబ సభ్యులు కోరారు. వెంటనే కలెక్టర్ను పిలిచి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఏం చేయాలో అది ఆలోచించి చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news