కియా సంస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !

-

కియా సంస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం నుంచి కియా సంస్థ ఒక మిలియన్ కార్లను ఉత్పత్తి చేసిన మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని.. కియా యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందనలు అన్నారు చంద్రబాబు.

2017లో ఏపీలో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పం అని.. ఈ సమర్థ విధానాలు ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాల కేంద్రంగా మార్చిందని వివరించారు. ప్రపంచ వేదికపై ఇది ఓ ప్రత్యేకతను చాటుకుందని.. ఇవాళ రాయలసీమ ప్రయోజనం పొందుతున్నందుకు నేను సంతోషిస్తున్నానని వివరించారు చంద్రబాబు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపాధి పొందుతున్నారన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news