మావోయిస్టులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ చత్తీస్గడ్ లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 28 మంది మావోయిస్టులు మరణించారు. ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం… మావోయిస్టులను చంపుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏకంగా 28 మంది మావోయిస్టులను మట్టి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సంఘటనలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలిపిరిలో బాంబు దాడి చేసిన ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు… ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. 2010 సంవత్సరంలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిలో కూడా ఇతడు కీలక పాత్ర పోషించడం గమనార్హం. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 లో పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐ ఈ డి లు పేల్చడం లో నంబాల కేశవరావు బిడ్డ. ఎంటెక్ చేస్తున్న సమయంలోనే నక్సలిజానికి ఆకర్షితుడై… అందులో కలిసిపోయాడు. ఇక ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందాడు కేశవరావు.