ఏపీలో కరెంట్‌ పీకుతున్న జగన్‌ ను…పదవీ నుంచి పీకేయాలి – చంద్రబాబు

-

అమరావతి : ఏపీలో కరెంట్‌ పీకుతున్న జగన్‌ ను…పదవీ నుంచి పీకేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పిలుపునిచ్చిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై టీడీపీ అధినేత చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. బాదుడే బాదుడు ఆందోళనల్లో భాగంగా త్వరలో క్షేత్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టనున్న చంద్రబాబు, లోకేష్… క్షేత్ర స్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు చంద్రబాబు.

ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమం పై జరిపిన సమీక్షలో వ్యాఖ్యానించారు చంద్రబాబు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రతి ఇంచార్జ్ సీరియస్సుగా తీసుకోవాలి.. ఎవరికీ మినహాయింపులు లేవని.. విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ ఛార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆగ్రహించారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధి పోతుందని.. పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతారని ఆగ్రహించారు. గ్రామాల్లో కరెంట్ పీకుతున్న జగన్ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version