ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య.. చంద్రబాబు ఫైర్

-

బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైసీపీ.. ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదని అన్నారు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని సవాల్ చేశారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్.. అంటూ లోకేశ్ నినదించారు. వాళ్లు ధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదు తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకను అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news