రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గెలవాలి – అచ్చెన్నాయుడు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరం అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. నేడు విజయవాడలో బోండా ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టిడిపి సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు మళ్ళీ గెలవాలని వ్యాఖ్యానించారు.

సానుభూతితో జగన్ అధికారంలోకి వచ్చాడని.. ఇప్పుడు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. అప్పుచేసి 13 లక్షల కోట్లలో జగన్ బటన్ నొక్కింది కేవలం లక్షన్నర కోట్లు మాత్రమేనని అన్నారు. మిగిలిన పదకొండున్నర లక్షల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కే చేరిందని ఆరోపించారు. ఇక అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు రోదిస్తూ ఉంటే వారిని ఎర్రి పప్పలంటూ మంత్రులు దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version