వైసీపీకి ఇంకా 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది – చంద్రబాబు

-

వైసీపీకి ఇంకా 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది..లెక్క పెట్టుకోండి అంటూ హెచ్చరించారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. ఇవాళ భోగి మంటలు అంటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్..అనంతరం జీవో కాపీలను భోగి మంటల్లో తగులబెట్టారు . ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టిందని….అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోందని వెల్లడించారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు.

chandrababu warns ycp party

ఇక్కడే రాజధాని ఉంటుందని టీడీపీ – జనసేన భరోసా ఇస్తున్నామన్నారు. సంక్రాంతి రోజున అంగన్వాడీలను రోడ్డున పడేశాడని ఆగ్రహించారు. యునతకు ఉపాధి కల్పించేలా టీడీపీ – జనసేన పార్టీ భరోసా ఇస్తుందని.. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత మా రెండు పార్టీలదేనని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం కూడా రాకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version