ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్న చంద్రబాబు..64.82 లక్షల మందికి లబ్ది !

-

NTR Bharosa Pensions Distribution : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు శుభవార్త. ఇవాళ పేదల ఖాతాల్లో డబ్బులు వేయనుంది బాబు కూటమి సర్కార్‌్‌. ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నేడు (గురువారం) ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా గుండుమలలో పెన్షన్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

NTR Bharosa Pensions Distribution Live Updates

ఇందు కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.

కాగా, ఇవాళ నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు….ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయలుదేరనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుని జలహారతిలో పాల్గొననున్న చంద్రబాబు….శ్రీశైలం జల విద్యుత్పత్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version