నా దృష్టిలో లావణ్య ఒక క్రిమినల్‌: మాల్వీ మల్హోత్ర

-

గత కొంత కాలంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  ఇక చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతం వీడి తను హీరోగా నటించిన ‘తిరగబడరా సామి’ అనే సినిమా ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. లావణ్య కేసు పెట్టిన ఈ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా ఈ ప్రెస్ మీట్ కి హాజరైంది. రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కి హాజరవుతున్న విషయం తెలుసుకున్న లావణ్య.. రాజ్ తరుణ్ ను కలవాలంటూ తిరగబడరా స్వామి ప్రెస్ మీట్ జరుగుతున్న ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చింది. ఆమెను అక్కడికి వెళ్లేందుకు అనుమతించలేదు.

ఇదిలా ఉంటే.. లావణ్య-రాజ్‌ తరుణ్‌కాంట్రవర్సీపై హీరోయిన్ మాల్వీ మల్హోత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నాతోపాటు నా సోదరుడిపై లావణ్య ఏవైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడా. దానిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు. ఎందుకు ఆమె ఇలా చేస్తున్నారో తెలియదు. 2020లో నన్ను కొట్టి ఇబ్బందిపెట్టిన కొంతమంది క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు కాంటాక్ట్‌లో ఉన్నారు. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్‌’ అని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version