BREAKING : తిరుమల నడకమార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక మృతి చెందింది. తిరుమలకు కాలినడకన వెళుతుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది.

మృతి చెందిన బాలిక వయసు ఆరు సంవత్సరాలుగా గుర్తించారు అధికారులు. కాలినడకన వెళుతుండగా ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. అయితే అక్కడ ఉన్న వారు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఆ చిన్నారి చిరుత దాడిలో మృతి చెందింది. దీంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news