పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు..!

-

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు సీఎం. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ తో పాటుగా ఏపీలో మంత్రులు ముఖ్య నాయకులు గ్రామ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన సీఎం.. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర అని అన్నారు.

అలాగే పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు. అయితే పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టకపోతే గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయి. కాబట్టి త్వరలోనే జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అలాగే ప్రజల ఆదాయం పెంచేందుకు రాష్ట్రంలో కొత్త కార్యక్రమాలు తీసుకొస్తా. వాటి నుండి సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకే పంచిపెడతా అన్నారు. అలాగే ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంనుంచి నుంచి ప్రజలకు స్వేచ్ఛ లభించింది. కానీ రాష్ట్రాన్ని ఇంకా భూతం వెంటాడుతుంది. ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలి అని చంద్రబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version