ఆగస్టు 1వ తేదీన విశాఖకు సీఎం జగన్

-

 

ఆగస్టు 1వ తేదీన విశాఖకు సీఎం జగన్ రానున్నారు. ఈ విషయాన్ని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీన రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పోర్టు హాస్పిటల్ సమీపంలో ఈనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు విచ్చేస్తున్న నేపథ్యంలో శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి విడదల రజిని.

ఈ సందర్భంగా విడదల రజినీ మాట్లాడుతూ.. ప్ర‌జారోగ్యం విష‌యంలో రాజీ అనేదే లేకుండా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముందుకు సాగుతున్నార‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో నెల రోజుల్లో మొత్తం కొత్త‌గా 12 ఎస్ ఎన్ సీయూ యూనిట్లు, 5 ఎన్ ఐసీ యూ యూనిట్లు ప్రారంభించ‌బోతున్నామ‌ని చెప్పారు. ఇటీవల విజ‌య‌వాడ‌లో కొత్త ప్రారంభించిన యూనిట్ల కోసం రూ.4.58 కోట్లు, 12 కొత్త SNCU ల కోసం రూ.7.2 కోట్లు, 5 కొత్త‌ NICU ల కోసం రూ. 3.89 కోట్లను త‌మ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంద‌ని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news