రేపు ఏపీకి రానున్న సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ లో మే13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో… ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.

రేపు ఏపీకి రానున్నారు సీఎం జగన్.  ఈ నెల 17న లండన్ కు వెళ్లారు సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ భార్య భారతి, కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించారు. దాదాపు  15 రోజుల తర్వాత రేపు ఏపీకి రానున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version